ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సొంతపార్టీకి షాక్ ఇచ్చారు. ఒంగోలులో 'జగన్ కోసం జనం' సంతకాల కార్యక్రమంలో ఆయన మంగళవారం తన తల్లి వెంకాయమ్మతో కలిసి పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వారు సంతకం చేశారు. అనంతరం బాలినేనికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ పరిణామంతో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వారు సంతకం చేశారు. అనంతరం బాలినేనికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ పరిణామంతో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.
0 comments:
Post a Comment