ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం కోరల్లేనిదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జూపూడి ప్రభాకర్, మూలింటి మారెప్ప పెదవి విరిచారు. దానివల్ల దళితులకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఆ చట్టానికి 10 సవరణలు కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు పి.ఎల్.పునియాకు వినతి పత్రం ఇచ్చినా దానిపై ఇంతవరకూ స్పందన లేదని విమర్శించారు.
దీనిపై వచ్చే వారం ఆయన్ను కలుస్తామని చెప్పారు. ‘‘ప్రభుత్వ చర్య కేవలం సబ్ప్లాన్ చట్టం చేశామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. దీనిద్వారా వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను ఎస్సీ, ఎస్టీలకు దూరం చేశామని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ అది జరగదు’’అని స్పష్టంచేశారు. 25 వేలకు పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
దీనిపై వచ్చే వారం ఆయన్ను కలుస్తామని చెప్పారు. ‘‘ప్రభుత్వ చర్య కేవలం సబ్ప్లాన్ చట్టం చేశామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. దీనిద్వారా వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను ఎస్సీ, ఎస్టీలకు దూరం చేశామని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ అది జరగదు’’అని స్పష్టంచేశారు. 25 వేలకు పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment