'పేదల నడ్డి విరుస్తున్న కిరణ్ సర్కార్' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పేదల నడ్డి విరుస్తున్న కిరణ్ సర్కార్'

'పేదల నడ్డి విరుస్తున్న కిరణ్ సర్కార్'

Written By news on Tuesday, January 29, 2013 | 1/29/2013

 విద్యుత్‌ ఛార్జీలతో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పేదల నడ్డివిరుస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. మూడునెలలకు ఒకసారి సర్‌ఛార్జి పేరిట అన్ని వర్గాలపై అదనపు భారాన్ని మోపుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్‌ ఆరోపించారు. 

మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలోని అనేక పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఉపాధిలేక కార్మికులు రోడ్డున పడ్డారని, పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని జనక్ ప్రసాద్ విమర్శించారు. రైతుల నుంచి 2004 సంవత్సరం నుంచి సర్ ఛార్జీల వసూలుకు సిద్ధపడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: