కాలికి గాయంతో డిసెంబర్ 14న తుర్కయాంజాల్ వద్ద నిలిపివేత
అక్కడి నుంచే యాత్ర తిరిగి మొదలవుతుంది: వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తరపున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఫిబ్రవరి 6వ తేదీన పునఃప్రారంభమవుతోంది. గత ఏడాది అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర షర్మిల కాలికి గాయం కారణంగా డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వద్ద నిలిచిపోయింది. అనంతరం షర్మిల కాలికి శస్త్ర చికిత్స జరిగింది. గాయం నుంచి షర్మిల కోలుకుంటుండటంతో యాత్రను కొనసాగించనున్నారు. ఇంతకు ముందు యాత్ర నిలిచిపోయిన తుర్కయాంజాల్ నుంచే ‘మరో ప్రజాప్రస్థానం’ తిరిగి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నేపథ్యంలో ప్రజాపక్షంగా వైఎస్సార్సీపీ తరపున షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. షర్మిల ఇప్పటిదాకా 58 రోజుల్లో 828.1 కిలోమీటర్లు నడిచినట్లు తెలి పారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలను కలిసి, వారిలో ధైర్యం నింపాలని షర్మిల చాలా పట్టుదలతో ఉన్నారని చెప్పారు. కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకునేం దుకు షర్మిల ప్రతిరోజూ ఫిజియోథెరపీ చేయించుకోవడంతో పాటు వైద్యుల సూచనలన్నింటినీ పాటించారని తెలిపారు. కాంగ్రెస్పక్ష నేత చంద్రబాబే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడని పద్మ అన్నారు. ‘‘అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను సర్వనాశనం చేసింది. ప్రజలపై కక్షగట్టినట్లు విపరీతమైన పన్నుల భారం మోపుతోంది. ప్రజల పాలిట శాపంగా మారింది. అయినా ఈ ప్రభుత్వం గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. ఆయన బాధ్యతను విస్మరించి అధికార పక్షానికి రక్షణ కల్పిస్తున్నారు. పైగా ప్రజలను మోసగించేందుకు యాత్రల పేరుతో పూటకొక అబద్ధం చెబుతున్నారు. ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పలువురు ఎమ్మెల్యేల రాజీనామాలతో ఈ ప్రభుత్వానికి సంఖ్యా బలం లేదు. మైనారిటీలో ఉంది. పాలించే అర్హతలేని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని బాబు చెప్పడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగడానికి చంద్రబాబు తీవ్రంగా తాపత్రయపడుతున్నట్లు ఆయన వ్యవహార శైలిని చూస్తే అర్థమవుతుంది. ఆయనే కాంగ్రెస్ పక్ష నేత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ప్రజల మధ్య ఉన్న జగన్ను అక్రమంగా బంధించారు. 8 నెలలు గడచినాజగన్కు బెయిల్ రాకుండా సీబీఐని అడ్డంపెట్టుకొని డ్రామాలాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీలను చూసి ప్రజలు నిరాశకు గురయ్యారని, అందుకే వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు జగన్ వదిలిన బాణంగా షర్మిల పాదయాత్ర చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న రాజన్న సువర్ణయుగం త్వరలోనే వస్తుందని పాదయాత్ర ద్వారా షర్మిల భరోసా ఇచ్చారన్నారు. పాదయాత్రను అడ్డుకొనే పరిస్థితి తలెత్తదు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా మాట తప్పలేదని, ఇడుపులపాయ ప్లీనరీలో చెప్పిన విషయానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని పద్మ తెలిపారు. ఇతర పార్టీల మాదిరిగా రెండు కళ్ల సిద్ధాంతమంటూనో, పూటకొక నిర్ణయం మార్చడమో చేయడంలేదన్నారు. షర్మిల పాదయాత్రను తెలంగాణవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోరని విలేకరుల ప్రశ్నకు బదులుగా చెప్పారు. అవి ఊహలేనని, అర్థంలేని ప్రశ్నలని కొట్టిపారేశారు. కేంద్ర హోం మంత్రి షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తమ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా దోషిగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రకటించాలని తాము మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆ పార్టీ తప్పించుకు తిరుగుతోందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక, కాంగ్రెస్ తన దుష్ట ఆలోచనలతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు మంచి ఆలోచనలతో దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలని సూచించా |
Home »
» అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలను కలిసి, వారిలో ధైర్యం నింపాలని...
అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలను కలిసి, వారిలో ధైర్యం నింపాలని...
Written By news on Thursday, January 31, 2013 | 1/31/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment