కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పేదల కష్టాలు పట్టడం లేదని వైఎస్ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎడాపెడా ఛార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
వైఎస్ఆర్ సీపీది లౌకిక విధానం అని ఆయన స్పష్టం చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మత విద్వేషాలు, ప్రాంతీయతత్వాన్ని ఎవరు రెచ్చగొట్టినా తప్పే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విషయంలో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉందన్నారు. జగన్కు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని తెలిపారు.
వైఎస్ఆర్ సీపీది లౌకిక విధానం అని ఆయన స్పష్టం చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మత విద్వేషాలు, ప్రాంతీయతత్వాన్ని ఎవరు రెచ్చగొట్టినా తప్పే అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విషయంలో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉందన్నారు. జగన్కు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని తెలిపారు.
0 comments:
Post a Comment