బొత్స అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హైకోర్టులో పిటిషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్స అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హైకోర్టులో పిటిషన్

బొత్స అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని హైకోర్టులో పిటిషన్

Written By news on Wednesday, January 30, 2013 | 1/30/2013

పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల జరిగిన తన కుమార్తె వివాహ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అయితే ఇందుకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని కాంగ్రెస్ సెక్యులర్ ఫోరమ్ దాఖలు చేసింది. దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మంగళవారం విచారించారు. 

కుమార్తె వివాహ సమయంలో బొత్స పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను, పోలీసు సిబ్బందిని వినియోగించుకున్నారని, అంతేగాక భారీగా ఖర్చు పెట్టారని, అయితే వీటి గురించిన సమాచారమివ్వాలని కోరగా.. ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని కోర్టుకు ఫోరం నివేదించింది. ప్రభుత్వ వనరులను ఈ విధంగా ఉపయోగించుకోవడం అధికార దుర్వినియోగమే అవుతుందని పేర్కొంది. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు
Share this article :

0 comments: