సీబీఐ తీరుపై వైఎస్ఆర్ సీపీ మండిపాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ తీరుపై వైఎస్ఆర్ సీపీ మండిపాటు

సీబీఐ తీరుపై వైఎస్ఆర్ సీపీ మండిపాటు

Written By news on Thursday, January 24, 2013 | 1/24/2013

సీబీఐ తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే అక్రమాలు జరిగినట్టు ఎలా నిర్థారిస్తారని ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రభుత్వం సహకరించకపోతే ముఖ్యమంత్రి, సీఎస్‌ను అరెస్టు చేయాలన్నారు. ఏ ఆధారాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారో చెప్పాలని ఆమె సీబీఐని డిమాండ్‌ చేశారు. దర్యాప్తు పేరుతో జగన్‌ను ఎంతకాలం జైల్లో పెడతారని నిలదీశారు.

దేశ చరిత్రలో ఇంత అధ్వాన్నమైన కేసును ఎన్నడూ చూడలేదని, ఇదే కేసులో మిగిలిన నిందితులకు ఓ న్యాయం... జగన్ కు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు. సీబీఐ వ్యవహారశైలి మార్చుకోకుంటే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. హైకోర్టు తీర్పు దురదృష్టకరమని ఆమె అన్నారు.
Share this article :

0 comments: