వైఎస్ జగన్ సూచనల మేరకే అక్బరుద్దీన్ మాట్లాడారన్న టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో కూడా రోజురోజుకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుండటంతో టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. సెక్యులర్ పార్టీగా అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే ఖండించినా...కావాలని కొంతమంది తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Home »
» కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రెహ్మన్
కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రెహ్మన్
Written By news on Monday, January 7, 2013 | 1/07/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment