తెలంగాణలో బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిసెంబరు 9 ప్రకటన తరువాత బలిదానాలు పెరిగాయన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగాలేదని చెప్పారు. ఆ పార్టీ విద్వేషాలు కోరుకుంటుందన్నారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ అభిప్రాయాన్ని చెప్పాలని తాము కోరుతూనే ఉన్నామన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని విమర్శించరని, దీనికి అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలిస్తే ఎవరూ ఆపలేరన్నారు. ఎంతమంది వ్యతిరేకించినా అణుఒప్పందం, ఎఫ్ డిఐ బిల్లలను పార్లమెంట్ లో ఆమోదింపజేసుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు.
Home »
» కాంగ్రెస్ వైఖరి వల్లే బలిదానాలు
కాంగ్రెస్ వైఖరి వల్లే బలిదానాలు
Written By news on Monday, January 28, 2013 | 1/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment