ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారే టీడీపీ పగ్గాలు చేపట్టి ఆపార్టీని అధోగతి పాలు చేశారని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆమె శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ను వేధించి మరణానికి కారణమైన వారి అల్లుళ్లు, కుమారులు, కూతుళ్లు నేడు ఆయన ఫొటోలకు దండలు వేస్తూ నివాళులర్పించడం బాధాకరమన్నారు.
ఎన్టీఆర్ చనిపోయిన నాడే టీడీపీకీ భవిష్యత్తు పోయిందని లక్ష్మీ పార్వతి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నేతిబీరకాయలో నెయ్యి మాదిరిగా ఉందని, టీడీపీని ఆరిపోయే దీపంలా చంద్రబాబు మార్చారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని, అధికారం కోసం ఏగడ్డి అయినా కరిచే వ్యక్తి అంటూ లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్న టీడీపీ అధికారంలోకి రావటం ఇక కల్ల అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు వారసులే లేరని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పేదల కోసం పనిచేసేవారే ఎన్టీఆర్ వారసులని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
ఎన్టీఆర్ చనిపోయిన నాడే టీడీపీకీ భవిష్యత్తు పోయిందని లక్ష్మీ పార్వతి అన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నేతిబీరకాయలో నెయ్యి మాదిరిగా ఉందని, టీడీపీని ఆరిపోయే దీపంలా చంద్రబాబు మార్చారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని, అధికారం కోసం ఏగడ్డి అయినా కరిచే వ్యక్తి అంటూ లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్న టీడీపీ అధికారంలోకి రావటం ఇక కల్ల అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు వారసులే లేరని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పేదల కోసం పనిచేసేవారే ఎన్టీఆర్ వారసులని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
0 comments:
Post a Comment