ఇడుపులపాయ నుంచి మొదలైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంతో 1,000 కిలో మీటర్ల మైలు రాయిని దాటనుంది. ఇప్పటి వరకు షర్మిల 991.2 కి.మీ. నడిచారు. మరో 8.8 కిలోమీటర్లు నడిస్తే వెయ్యి కి.మీ. పూర్తి కానుంది. నల్లగొండ జిల్లా దామచెర్ల మండలం కొండ్రపోలు కాల్వ వద్ద సరిగ్గా వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతాయి. దీంతో అక్కడ కొండ్రపోలు గ్రామస్తులు వైఎస్సార్ విగ్రహం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే గ్రామానికి సూర్యానాయక్ అనే గిరిజన రైతు తన వ్యవసాయ భూమిలో 240 గజాల స్థలాన్ని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు ఇచ్చారు. మరోవైపు వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
Home »
» షర్మిల పాదయాత్రకు నేటితో 1,000 కి.మీ. పూర్తి
షర్మిల పాదయాత్రకు నేటితో 1,000 కి.మీ. పూర్తి
Written By news on Monday, February 18, 2013 | 2/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment