సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయడానికి రెండు కీలకమైన కమిటీల ఏర్పాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయడానికి రెండు కీలకమైన కమిటీల ఏర్పాటు

సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయడానికి రెండు కీలకమైన కమిటీల ఏర్పాటు

Written By news on Wednesday, February 13, 2013 | 2/13/2013

సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెండు కీలకమైన కమిటీలను ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కన్వీనర్‌గా పార్టీ సభ్యత్వ నమోదు కమిటీని, పార్టీ పీఏసీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు కన్వీనర్‌గా మానవ వనరుల అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సభ్యత్వ కమిటీలో పీఎన్‌వీ ప్రసాద్, డి.రవీంద్రనాయక్, బండారు మోహన్‌రెడ్డి, జి.వి.సుధాకర్‌రెడ్డి ఉన్నారు. మానవ వనరుల అభివృద్ధి కమిటీలో బి.జనక్‌ప్రసాద్, కుంభా రవిబాబు, విజయా శారదారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, హరిరామజోగయ్య ఉంటారని సుబ్బారెడ్డి వెల్లడించారు.
Share this article :

0 comments: