Home »
» ఎన్ని వేషాలు వేసినా బాబును ప్రజలు నమ్మరు
ఎన్ని వేషాలు వేసినా బాబును ప్రజలు నమ్మరు
టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే ఆరు నెలల్లో రాష్ట్రాన్ని తగలబెడతారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ధ్వజమెత్తారు. అధికార కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు, తన మచ్చలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలకు పూటకో అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. బాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా, మరెన్ని మోసపూరిత ప్రకటనలు చేసినా నమ్మే పరిస్థితి లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండెకరాల పొలంతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు ప్రస్తుతం దేశ విదేశాల్లో రూ.లక్ష కోట్లకు పైబడి ఆస్తులున్నాయని ఆరోపించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగినన్ని కుంభకోణాలు రాష్ట్ర చరిత్రలో జరగలేదని వివరించారు. ‘‘అర్బన్ బ్యాంకుల మూసివేత, నకిలీ స్టాంపుల కుంభకోణం, నీరు-మీరు పథకం, పనికి ఆహార పథకం, మద్యం కుంభకోణం, రహేజా భూములు, కాందిశీకుల భూములు... ఇలా చెప్పుకుంటూ పోతే బాబు అవినీతికి అంతే ఉండదు’’ అని పేర్కొన్నారు. ఇన్ని మచ్చలు పెట్టుకున్న చంద్రబాబు మహానేత రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.
|
|
0 comments:
Post a Comment