వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఈ నెల 20వ తేదీ బుధవారం హైదరాబాద్లో జరగనుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన ఆమె క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించినా రైతులను ఆదుకోలేని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధత వంటి అంశాలను సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు.
కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ సహకార సంఘాలకు ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలపై సమీక్ష కూడా సమావేశంలో జరుగుతుంది. ఇవేకాక సంస్థాగత అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ పీఏసీ, సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్లు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంటున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ సహకార సంఘాలకు ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికలపై సమీక్ష కూడా సమావేశంలో జరుగుతుంది. ఇవేకాక సంస్థాగత అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ పీఏసీ, సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్లు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంటున్నారు.
0 comments:
Post a Comment