మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర బుధవారం మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సాగనుందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి పేటకన్నెగండ్లకు చేరుకుని అక్కడినుంచి 3.7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. భోజనానంతరం గురజాల నియోజకవర్గంలోని జూలకల్లు, గుత్తికొండ క్రాస్రోడ్, పందిరివారిపాలెం మీదుగా రాత్రి బస కేంద్రానికి చేరుకుంటారని వివరించారు.
పర్యటించే గ్రామాలు
మాచర్ల నియోజకవర్గంలోని పేట సన్నిగండ్ల, గురజాల నియోజకవర్గం జూలకల్లు, గుత్తికొండ క్రాస్రోడ్స్, పందిరివారిపాలెం.
పర్యటించే గ్రామాలు
మాచర్ల నియోజకవర్గంలోని పేట సన్నిగండ్ల, గురజాల నియోజకవర్గం జూలకల్లు, గుత్తికొండ క్రాస్రోడ్స్, పందిరివారిపాలెం.
0 comments:
Post a Comment