పార్టీలో చేరిన నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీలో చేరిన నేతలు

పార్టీలో చేరిన నేతలు

Written By news on Thursday, February 21, 2013 | 2/21/2013


 శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాయిరాజ్‌తోపాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు, టీడీపీ నేత పాతపట్నం ఇన్‌చార్జి కలమట వెంకటరమణలు కూడా పార్టీలో చేరారు. వీరికి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, సుజయకృష్ణ రంగారావు, కేంద్రపాలక మండలిసభ్యులు పెన్మత్స సాంబశివరాజు, శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ తదితరులున్నారు.

పార్టీలో చేరిన అరకు నేతలు
విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన కొత్తపల్లి గీతతోపాటు పలువురు మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు పార్టీలో చేరారు.
Share this article :

0 comments: