ఇప్పటికైనా మేల్కొండి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇప్పటికైనా మేల్కొండి..

ఇప్పటికైనా మేల్కొండి..

Written By news on Saturday, February 23, 2013 | 2/23/2013


పౌరుల భద్రత విషయంలో మొద్దునిద్ర పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ బాంబుపేలుళ్ల ఘటనతోనైనా మేల్కోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కె.రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పాలకులు భద్రతా వ్యవస్థను వారి భద్రత కోసం వినియోగించుకుంటున్నారే తప్పా పౌరులకు భద్రత కల్పించడం లేదన్నారు. ఉగ్రవాద ముప్పు ఉందన్న సమాచారం ముందే తెలిసినా పోలీస్ యంత్రాంగం, నిఘా వ్యవస్థలు చొరవ చూపకపోవడం క్షమించరాని విషయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి, అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పేలుళ్ల ఘటనలో ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలను అందించాలని, ఈ ఘటనకు పాల్పడిన నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: