రాష్ట్రంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్కు ప్రాణం పోసి రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత దివంగత వైఎస్కే దక్కుతుందని అద్దంకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం ఆయన చంచల్గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రత్యేక ములాఖత్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... జగన్ను జైలుపాలు చేసి ఇబ్బందులు పెడుతున్న తరుణంలో ఆయనకు అండగా ఉండేందుకు కాంగ్రెస్ను వీడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అస్తిత్వానికి అహర్నిశలు కృషి చేసిన గొప్పనేత వైఎస్ అని కొనియాడారు. అలాంటిది ఆయన తనయుడు జగన్ను కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు కలిసి కుమ్మక్కై ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. అద్దంకి ప్రజల అభీష్టం మేరకు వైఎస్సార్సీపీలో చేరేందుకు జగన్ను కలిసినట్టు చెప్పారు. సోమవారం జగన్ను కలిసినవారిలో తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన నాయకుడు పలిచర్ల శ్రీనివాస్, రాజమండ్రికి చెందిన ఆకుల వీర్రాజు ఉన్నారు. వీరివెంట కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు.
Home »
» కాంగ్రెస్కు అధికారం వైఎస్సార్ ఘనతే: గొట్టిపాటి
కాంగ్రెస్కు అధికారం వైఎస్సార్ ఘనతే: గొట్టిపాటి
Written By news on Tuesday, February 26, 2013 | 2/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment