రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే మగాడు లేడని తెలుగుదేశం పార్టీ స్పష్టంచేసింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని కూల్చాలని తొడలు కొట్టే వారేనని, అయినా ప్రభుత్వం కూలిపోదని తెలిపింది. ఎన్టీఆర్ భవన్లో సోమవారం పార్టీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు కాపాడిన విషయాన్ని గుర్తుచేస్తూ... ఇక్కడ కూడా ఆ పాత్ర పోషించేవారు ఉంటారని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించామని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వారి పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Home »
» ప్రభుత్వాన్ని కూల్చే మగాడు లేడు:తెలుగుదేశం
ప్రభుత్వాన్ని కూల్చే మగాడు లేడు:తెలుగుదేశం
Written By news on Tuesday, February 5, 2013 | 2/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment