మూడేళ్లుగా రెండు పార్టీలూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి
ఇప్పుడవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి
వైఎస్సార్ సీపీ జెండాలతో బైక్పై మంత్రి తిరగడం కుట్రలో భాగమే
సహకార ఎన్నికల్లో తెలుగుదేశానికి మేలు చేకూర్చేందుకే ఇదంతా..
చంద్రబాబూ.. మీరు కాంగ్రెస్తో కుమ్మక్కు కాకపోతే..
అవిశ్వాసం పెట్టండి.. అప్పుడు ఎవరేంటో తేలిపోతుంది
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు మూడేళ్లుగా కొనసాగిస్తున్న కుమ్మక్కు కుట్రలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉప నేత మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రి ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఉన్న బైక్ మీద కూర్చొని సహకార సంఘాల ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న కథనాలు అందులో భాగమేనని తెలిపారు. కాంగ్రెస్కు మిత్రపక్షంగా మారిన తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారపక్షం కుయుక్తులు పన్నుతోందని, ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండి స్తున్నామని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే, ఆయన కాంగ్రెస్తో కుమ్మక్కు కాకపోతే.. ప్రజాకంఠక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎవరేంటో తేలిపోతుం దని సుచరిత అన్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్తో కొనసాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పూటకొక అబద్ధం చెప్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆమె గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
గ్రామాల్లో పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి
రాష్ట్రంలో ప్రజలు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నా.. చంద్రబాబుకు అవేవీ పట్టకపోగా కాంగ్రెస్తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలను తు.చ. తప్పకుండా ఆయన పాటిస్తున్నారని సుచరిత దుయ్యబట్టారు. గ్రామాల్లో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సామాన్యుడికి బతకలేని పరిస్థితి కాంగ్రెస్ పాలకులు కల్పిస్తున్నారు. ఎడాపెడా కరెంటు కోతలతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కరెంటు బిల్లులు చూస్తే షాక్కు గురిచేస్తున్నాయి. మరోపక్క 104 వాహనం కనిపించడంలేదు. ఆరోగ్యశ్రీ పడకేసింది. 108 గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పేదవారికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. వృద్ధాప్య పెన్షన్లు ఒక్కటీ మంజూరు కాకపోగా ఉన్నవాటిని తొలగిస్తున్నారు. ఒక కొత్త ఇల్లు కూడా కట్టించలేదీ ప్రభుత్వం’ అని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం రెండు నెలల్లో ముగుస్తున్నా... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,900 కోట్ల మేర చెల్లించకుండా ప్రభుత్వం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. మహానేత రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. అయితే ప్రజలను ఇంతగా హింసిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదని సుచరిత ప్రశ్నించారు.
మాటకు కట్టుబడిన జగన్...: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను చంద్రబాబుకు సుచరిత గుర్తుచేశారు. ‘జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్లో ఉండి ఉంటే కేంద్ర మంత్రిని చేసేవారమని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవారమని ఆజాద్ చెప్పారు. కానీ మా నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వల్లే కదా అక్రమ కేసులతో 8 నెలలుగా నిర్బంధించినప్పటికీ చెక్కు చెదరని ధైర్యంతో ఉన్నారు. మా నాయకుడిని చూసి మేం గర్విస్తున్నాం’ అని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో తనపై విచారణ జరగకుండా చూసుకునేందుకు.. వ్యక్తిత్వాన్ని అమ్ముకొని చీకట్లో చిదంబరాన్ని కలుస్తూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి వ్యవహారాలు చూస్తుంటే అసహ్యం కలుగుతోందని, వీళ్లు మనుషులేనా అనే భావం కలుగుతోందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక పథకం ప్రకారం మాల, మాదిగలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేందుకు రెండు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా వారు అవేవీ పట్టించుకోకుండా జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారన్నారు.
సమస్యలు సృష్టించేది కాంగ్రెస్సే..: ‘‘రాష్ట్రంలో సమస్యలను కాంగ్రెస్ వారే సృష్టిస్తారు. ఆ తర్వాత సమస్యలపై నిరసనలకు వారే నాయకత్వం వహించేటట్టుగా కుట్రలు, కుయుక్తులు పన్నుతారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ‘డిసెంబర్ 9 ప్రకటన’తో కాంగ్రెస్ నాయకత్వం అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఒక తండ్రిలా ఆలోచన చేసి ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యకు పరిష్కారం చూపాల్సిందిపోయి, ఓట్ల కోసం రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి సంబంధం లేని ఖమ్మం జిల్లా మంత్రి చేత కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ జెండాలు ఉన్న బైక్ ఎక్కించడం, ఆయన కావాలనే ఆ బైకు మీద తిరగటం.. అంతా రెండు పార్టీల కుట్రలో భాగమే. టీడీపీకి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఏమనాలో అర్థం కావడంలేదు’ అని సుచరిత దుయ్యబట్టారు.
ఇప్పుడవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి
వైఎస్సార్ సీపీ జెండాలతో బైక్పై మంత్రి తిరగడం కుట్రలో భాగమే
సహకార ఎన్నికల్లో తెలుగుదేశానికి మేలు చేకూర్చేందుకే ఇదంతా..
చంద్రబాబూ.. మీరు కాంగ్రెస్తో కుమ్మక్కు కాకపోతే..
అవిశ్వాసం పెట్టండి.. అప్పుడు ఎవరేంటో తేలిపోతుంది
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు మూడేళ్లుగా కొనసాగిస్తున్న కుమ్మక్కు కుట్రలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉప నేత మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రి ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఉన్న బైక్ మీద కూర్చొని సహకార సంఘాల ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారంటూ వస్తున్న కథనాలు అందులో భాగమేనని తెలిపారు. కాంగ్రెస్కు మిత్రపక్షంగా మారిన తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు అధికారపక్షం కుయుక్తులు పన్నుతోందని, ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండి స్తున్నామని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే, ఆయన కాంగ్రెస్తో కుమ్మక్కు కాకపోతే.. ప్రజాకంఠక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎవరేంటో తేలిపోతుం దని సుచరిత అన్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్తో కొనసాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పూటకొక అబద్ధం చెప్తూ ప్రజలను మోసగిస్తున్నారని ఆమె గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
గ్రామాల్లో పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి
రాష్ట్రంలో ప్రజలు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నా.. చంద్రబాబుకు అవేవీ పట్టకపోగా కాంగ్రెస్తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలను తు.చ. తప్పకుండా ఆయన పాటిస్తున్నారని సుచరిత దుయ్యబట్టారు. గ్రామాల్లో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సామాన్యుడికి బతకలేని పరిస్థితి కాంగ్రెస్ పాలకులు కల్పిస్తున్నారు. ఎడాపెడా కరెంటు కోతలతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కరెంటు బిల్లులు చూస్తే షాక్కు గురిచేస్తున్నాయి. మరోపక్క 104 వాహనం కనిపించడంలేదు. ఆరోగ్యశ్రీ పడకేసింది. 108 గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పేదవారికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. వృద్ధాప్య పెన్షన్లు ఒక్కటీ మంజూరు కాకపోగా ఉన్నవాటిని తొలగిస్తున్నారు. ఒక కొత్త ఇల్లు కూడా కట్టించలేదీ ప్రభుత్వం’ అని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం రెండు నెలల్లో ముగుస్తున్నా... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,900 కోట్ల మేర చెల్లించకుండా ప్రభుత్వం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. మహానేత రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. అయితే ప్రజలను ఇంతగా హింసిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదని సుచరిత ప్రశ్నించారు.
మాటకు కట్టుబడిన జగన్...: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను చంద్రబాబుకు సుచరిత గుర్తుచేశారు. ‘జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్లో ఉండి ఉంటే కేంద్ర మంత్రిని చేసేవారమని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవారమని ఆజాద్ చెప్పారు. కానీ మా నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వల్లే కదా అక్రమ కేసులతో 8 నెలలుగా నిర్బంధించినప్పటికీ చెక్కు చెదరని ధైర్యంతో ఉన్నారు. మా నాయకుడిని చూసి మేం గర్విస్తున్నాం’ అని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో తనపై విచారణ జరగకుండా చూసుకునేందుకు.. వ్యక్తిత్వాన్ని అమ్ముకొని చీకట్లో చిదంబరాన్ని కలుస్తూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి వ్యవహారాలు చూస్తుంటే అసహ్యం కలుగుతోందని, వీళ్లు మనుషులేనా అనే భావం కలుగుతోందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక పథకం ప్రకారం మాల, మాదిగలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఎస్సీల మధ్య చిచ్చుపెట్టేందుకు రెండు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా వారు అవేవీ పట్టించుకోకుండా జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచారన్నారు.
సమస్యలు సృష్టించేది కాంగ్రెస్సే..: ‘‘రాష్ట్రంలో సమస్యలను కాంగ్రెస్ వారే సృష్టిస్తారు. ఆ తర్వాత సమస్యలపై నిరసనలకు వారే నాయకత్వం వహించేటట్టుగా కుట్రలు, కుయుక్తులు పన్నుతారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ‘డిసెంబర్ 9 ప్రకటన’తో కాంగ్రెస్ నాయకత్వం అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఒక తండ్రిలా ఆలోచన చేసి ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యకు పరిష్కారం చూపాల్సిందిపోయి, ఓట్ల కోసం రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి సంబంధం లేని ఖమ్మం జిల్లా మంత్రి చేత కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ జెండాలు ఉన్న బైక్ ఎక్కించడం, ఆయన కావాలనే ఆ బైకు మీద తిరగటం.. అంతా రెండు పార్టీల కుట్రలో భాగమే. టీడీపీకి లాభం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఏమనాలో అర్థం కావడంలేదు’ అని సుచరిత దుయ్యబట్టారు.
0 comments:
Post a Comment