అన్నిఅంశాలలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. మరో ప్రజాప్రస్తానం పాదయాత్రలో భాగంగా మర్రిగూడెం గ్రామంలో రాత్రి 7 గంటలకు జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు ఉపాధిలేదు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు అటు ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు గానీ పట్టవన్నారు. ప్రభుత్వం చేసే తప్పులు బాబుకు కనపడవని విమర్శించారు. కిరణ్ ప్రభుత్వాన్ని బాబు కాపాడుతూ ఉంటాన్నారని, అందుకే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టరని అన్నారు.
Home »
» అన్నిఅంశాలలో ప్రభుత్వం విఫలం:షర్మిల
అన్నిఅంశాలలో ప్రభుత్వం విఫలం:షర్మిల
Written By news on Saturday, February 9, 2013 | 2/09/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment