దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు అనుభవరాహిత్యానికి పరాకాష్ట అని ఆ పార్టీ మండిపడింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం అనుభవలేమి, అవగాహనా రాహిత్యం స్పష్టంగా బయటపడ్డాయని ఆయన విమర్శించారు.
శుక్రవారం మైసూరారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తడానికా పోలీసులు ఉన్నది అని ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ సాయిబాబా గుడి నుంచి వెళ్లిన అయిదు నిమిషాలకే ఆ పరిసర ప్రాంతాల్లో బాంబులు పేలాయంటే.. పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాద అణిచివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందని మైసూరా స్పష్టం చేశారు
శుక్రవారం మైసూరారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తడానికా పోలీసులు ఉన్నది అని ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ సాయిబాబా గుడి నుంచి వెళ్లిన అయిదు నిమిషాలకే ఆ పరిసర ప్రాంతాల్లో బాంబులు పేలాయంటే.. పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాద అణిచివేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందని మైసూరా స్పష్టం చేశారు
0 comments:
Post a Comment