వైఎస్ఆర్ సీపీ గెలుస్తుందనే కారణంతోనే ఎన్నికల అధికారి చంద్రశేఖర్ను కాంగ్రెస్ మాయం చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల అధికారిని చిత్తూరులో దాచినట్లు సమాచారం అందిందని బాలినేని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ బలంగా ఉన్న స్థానాలన్నింటిపై స్టే విధించారని ఆయన విమర్శించారు. అధికారులు సైతం కాంగ్రెస్కు కొమ్ముకాస్తున్నారని, రేపు ఎన్నికలు సక్రమంగా జరుగుతుండటం నమ్మకంలేదని బాలినేని ఆందోళన వ్యక్తం చేశారు.
కడప: కనిపించకుండా పోయిన ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ఆచూకీ లభ్యమైంది. కలెక్టర్ బంగ్లాలో ఎన్నికల అధికారి చంద్రశేఖర్ ప్రత్యక్షమయ్యారు. మంత్రులు తీసుకురమ్మన్నారని ఎవరో తీసుకుపోయారని మీడియాకు చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు కడప వన్టౌన్ పీఎస్లో చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు.
|
0 comments:
Post a Comment