అదిగో రాజన్న బిడ్డ.. అక్కున చేర్చుకున్న పట్నం గడ్డ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అదిగో రాజన్న బిడ్డ.. అక్కున చేర్చుకున్న పట్నం గడ్డ!

అదిగో రాజన్న బిడ్డ.. అక్కున చేర్చుకున్న పట్నం గడ్డ!

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

అడుగడుగునా ఆప్యాయత.. అంతకుమించిన ఆదరణ.. రాజన్న బిడ్డను చూడాలనే ఆదుర్దా.. కిలోమీటర్ల దూరం ఎదురేగి ఆహ్వానం.. ప్రతిగా కమ్మని పలకరింపు.. జన సందోహంలో పారవశ్యం.. ఇవి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో కనిపించిన దృశ్యాలు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలపున:ప్రారంభించిన పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. వైఎస్‌ఆర్ సుపరిపాలనను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత చేతగాని ప్రభుత్వ తీరును షర్మిలతో మొరపెట్టుకున్నారు. - న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం రూరల్

కన్న బిడ్డను మించిన ఆప్యాయత..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అంబోజి జంగయ్య వీరాభిమాని. టెలివిజన్‌లో, దిన పత్రికల్లో రాజశేఖరరెడ్డి వార్త ఏదైనా ఉందంటే తెలుసుకోకుండా వదిలేవాడు కాదు. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన యాదవ కులస్తుడైన ఆయన పెద్దగా చదువుకోలేదు.. కానీ రాజశేఖరరెడ్డికి సంబంధించిన సమగ్ర సమాచారం అతనికి తెలుసు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించినప్పుడు జంగయ్య తల్లడిల్లిపోయాడు. అప్పటినుంచి జగన్‌మోహన్‌రెడ్డిలో రాజశేఖరరెడ్డిని చూసుకుంటున్నాడు. మరోప్రజా ప్రస్థానంలో భాగంగా పాదయాత్ర కొనసాగిస్తున్న రాజన్న బిడ్డ షర్మిలమ్మను చూడగానే ఆనందంలో జంగయ్య ఒక్కసారిగా ఘొళ్లుమన్నాడు. కన్నీరు పెట్టుకుంటూ వైఎస్‌ను స్మరించుకున్న ఆయన్ను చూసి షర్మిల ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ‘జంగయ్యా!’ అంటూ పేరు పెట్టి మహానేత తనయ ఆప్యాయంగా పిలవడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. జగనన్న చెల్లికి గొర్రెపిల్లను బహూకరించి తన ఆప్యాయత చాటుకున్నాడు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదు
శ్రీ ఇందు కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థుల మొర
ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఇంజినీరింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల మంగల్‌పల్లిగేట్ సమీపంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ‘హాయ్ ఫ్రెండ్స్.. హౌ ఆర్‌యూ’ అంటూ ఆప్యాయంగా పలకరించిన షర్మిలకు విద్యార్థులు ‘ఫైన్’ అంటూ సమాధానమిచ్చారు. ఇంజినీరింగ్ నాల్గో సంవత్సరం చదువుతున్న ప్రత్యూష షర్మిల వద్దకు వెళ్లి ఆమెకు విద్యార్థుల సమస్యలను వినిపించింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయకపోవడంతో తాము ఇబ్బందులకు గురై చదువుపై దృష్టిసారించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన షర్మిల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేసేలా ప్రభుత్వంతో పోరాడుతామని హామీ ఇచ్చారు. జగన్ మోహన్‌రెడ్డి సీఎం అయితే విద్యార్థులకు సంపూర్ణ న్యాయం చేస్తారని చెప్పారు.

బతుకులు ఆగం చేస్తున్నారమ్మా
మరోప్రజా ప్రస్థానంలో భాగంగా శేరిగూడలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది మహిళలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను రాజన్న బిడ్డకు విన్నవించుకున్నారు. 

షర్మిల : అమ్మా! ఎలా వున్నారు..? 
కంబాళపల్లి లక్ష్మమ్మ : నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఏం కొందామన్నా కూలి డబ్బులు సరిపోవడంలేదు. పేరుకు రూపాయి కిలో బియ్యం అని చెప్తున్నారు.. కానీ ఇతర నిత్యావసర ధరలు మాత్రం రోజురోజుకూ పెంచుతూ మాలాంటోళ్లు బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. 

షర్మిల: త్వరలో రాజన్న రాజ్యంలో జగనన్న పాలన వస్తుంది. అప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సిగ్గులేని ఈ ప్రభుత్వం పేదలను దోచుకుంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. 
నర్కుడ పద్మ : మేం కూలి చేసుకుని నాలుగు పైసలు సంపాదిస్తాం. ఏదైనా లోన్‌లు తీసుకుని ఇళ్లు కట్టుకుందామంటే రుణాలు అందడంలేదు..

షర్మిల : ప్రతిపేదకు ఇల్లు ఉండాలని వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది. త్వరలో మనకు మంచిరోజులు వస్తాయి. 
బోసుపల్లి యాదమ్మ : తాగడానికి నీళ్లులేవు.. నీటికోసం తిప్పలు ఇప్పటినుంచే మొదలవుతున్నాయి..
షర్మిల : తాగునీటికోసం గ్రామీణ ప్రాంతాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా రాజశేఖరరెడ్డి చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత పాలకులు ప్రజల తాగునీటి సమస్యల్ని పట్టించుకోకుండా పదవులకోసం కుస్తీలు పడుతున్నారు. శేరిగూడలో స్థానికలతో రచ్చబండలో ప్రజల సమస్యలు తెలుసుకున్న షర్మిల తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తూ ఇబ్రహీంపట్నం బయలుదేరారు.
Share this article :

0 comments: