'బాబు, కిరణ్... ఇద్దరూ ఇద్దరే' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బాబు, కిరణ్... ఇద్దరూ ఇద్దరే'

'బాబు, కిరణ్... ఇద్దరూ ఇద్దరే'

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

ఆగపల్లి : మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల గురువారం రంగారెడ్డి జిల్లా ఆగపల్లిలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ సమస్యలను షర్మిలతో చెప్పుకున్నారు. తాగునీరు, కరెంట్ ఛార్జీలు, పించన్ల సమస్యలపై గోడు వెలిబుచ్చారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడు గంటల విద్యుత్ ఇచ్చారని, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. వైఎస్ ఉన్నప్పుడు ఎన్నడూ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ప్రజలు కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. 

వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. చంద్రబాబు మాత్రం ఎనిమిదిసార్లు కరెంట్ చార్జీలు పెంచారని, ప్రస్తుత కాంగ్రెస్ మూడుసార్లు చార్జీలు పెంచిందని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబుకు, కిరణ్ కు తేడాలేదని, ఇద్దరూ ఇద్దరేనని ఆమె ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: