వైఎస్ఆర్ సిపి కొవ్వొత్తుల ప్రదర్శన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపి కొవ్వొత్తుల ప్రదర్శన

వైఎస్ఆర్ సిపి కొవ్వొత్తుల ప్రదర్శన

Written By news on Friday, February 22, 2013 | 2/22/2013

దిల్‌సుఖ్‌నగర్ లో బాంబు పేలుళ్లకు నిరసన తెలుపుతూ వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా, పార్టీలకు అతీతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కూకట్ పల్లిలో వైఎస్ఆర్ సీపీ నేత జనార్దనరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. వడ్డేపల్లి నర్సింగరావు, ముక్కా రూపానందరెడ్డి, కొలను శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గుంటూరులో పార్టీ నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో వైఎస్‌ఆర్ సీపీ నేత వరుద కల్యాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. కరీనంగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. 

విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. జీవీఎంసీ నుంచి జగదాంబ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. కర్నూలులో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండాలతో కార్యకర్తలు ర్యాలీ జరిపారు. చిత్తూరులో జర్నలిస్టులు, వైఎస్ఆర్ సీపీ, ఏబీవీపీ కార్యకర్తలు దిల్‌సుఖ్‌నగర్ లో బాంబు పేలుళ్ల మృతులకు నివాళులర్పించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
Share this article :

0 comments: