వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాలికి దెబ్బ తగలలేదంటూ, ఆపరేషన్ జరగలేదంటూ తెలంగాణ జాగృతి సంస్థ అదినేత కవిత చేసిన వ్యాఖ్యలపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు.ఆ పార్టీ నేత గోనె ప్రకాశరావు అయితే రెండువేల తొమ్మిదిలో కెసిఆర్ దొంగ దీక్ష చేశారని,దానికి సంబందించిన వివరాలు అన్ని తనవద్ద ఉన్నాయని,అలాంటి వారు షర్మిలపై ఆరోఫణలు చేయడం ఏమిటని ధ్వజమెత్తారు.కెసిఆర్ బండారం బయటపెడతానని, నిమ్స్ వైద్య పరీక్షల వివరాలు కవితకు పంపుతానని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో దీక్ష ను డాక్టర్లు బలవంతంగా కెసిఆర్ విరమించ చేసినప్పట్టికీ తాను దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో సెలైన్ ఎక్కించుకుంటూ కెసిఆర దీక్ష చేశారని అంటూ దానికి సంబందించిన కాగితాలను గోనె అప్పట్లోనే మీడియాకు ఇచ్చేవారు. ఇప్పుడు షర్మిలపై కవిత ఆరోపణలు చేయడంతో ఆయన మరోసారి వాటిని చూపుతున్నారు. కాగా కవిత ఇలాంటి ఆరోపణలు చేయడం నీచమని మరో నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.కాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ డాక్టర్ల విభాగం నేతలు మాట్లాడుతూ షర్మిల కాలికి సంబందించిన ఎమ్.ఆర్.ఐ తదితర వివరాలను చూడవచ్చని అన్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20130206_11.php
0 comments:
Post a Comment