వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు బయల్దేరారు. బుధవారం ఉదయం లోటస్ పాండ్ లోని నివాసం నుంచి బయల్దేరే ముందు ఆమె సర్వమత ప్రార్థనలు చేశారు. కాగా షర్మిల పాదయాత్రకు మద్దతుగా వేలాదిమంది తరలి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
గత డిసెంబర్లో మోకాలి గాయం కారణంగా యాత్ర ఆగిపోయిన రంగారెడ్డిజిల్లా తుర్కయాంజాల్ నుంచే షర్మిల పాదయాత్ర మొదలుపెడతున్నారు. తుర్కయాంజాల్ ఎస్ ఎస్ ఆర్ గార్డెన్స్ నుంచి మొదలవనున్న మరో ప్రజాప్రస్థానం... రాగన్నగూడ, మన్నెగూడ ఔటర్రింగ్రోడ్, బొంగులూరు గేట్, కల్లెం జగ్గారెడ్డి గార్డెన్స్, మంగళంపల్లి గేట్, షేర్గూడ, ఇబ్రహీంపట్నం వరకు సాగుతుంది. షర్మిల నేడు మొత్తం పదిహేను కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తారు. పెష్వా ఫంక్షన్ హాల్లో ఆమె రాత్రి బస చేస్తారు.
గత డిసెంబర్లో మోకాలి గాయం కారణంగా యాత్ర ఆగిపోయిన రంగారెడ్డిజిల్లా తుర్కయాంజాల్ నుంచే షర్మిల పాదయాత్ర మొదలుపెడతున్నారు. తుర్కయాంజాల్ ఎస్ ఎస్ ఆర్ గార్డెన్స్ నుంచి మొదలవనున్న మరో ప్రజాప్రస్థానం... రాగన్నగూడ, మన్నెగూడ ఔటర్రింగ్రోడ్, బొంగులూరు గేట్, కల్లెం జగ్గారెడ్డి గార్డెన్స్, మంగళంపల్లి గేట్, షేర్గూడ, ఇబ్రహీంపట్నం వరకు సాగుతుంది. షర్మిల నేడు మొత్తం పదిహేను కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తారు. పెష్వా ఫంక్షన్ హాల్లో ఆమె రాత్రి బస చేస్తారు.
0 comments:
Post a Comment