సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటున్నవారికి వైఎస్ఆర్ సీపీ సవాల్ విసిరింది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. మధ్యంతర ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుస్తామని అంబటి వ్యాఖ్యానించారు.
తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు బొత్స చెప్తున్నారని.. ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే అసెంబ్లీలో మీకు మెజార్టీ ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఇంతకంటే మంచి సమయం మళ్లీ దొరకదు అని అంబటి రాంబాబు అన్నారు
తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు బొత్స చెప్తున్నారని.. ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే అసెంబ్లీలో మీకు మెజార్టీ ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఇంతకంటే మంచి సమయం మళ్లీ దొరకదు అని అంబటి రాంబాబు అన్నారు
0 comments:
Post a Comment