స్వార్థ రాజకీయ నాయకులు ఒక పథకం ప్రకారం వై.ఎస్.జగన్ని ఒంటరిని చెయ్యాలని చూసినా ప్రజల ఆదరాభిమానాలు మాత్రం పూర్తిగా ఆయనకే ఉన్నాయి. ఓదార్పుయాత్ర చేపట్టడం, ప్రజల కన్నీటిని తుడవడం జగన్ చేసిన నేరమా? నిజానికి ప్రజానేత వైఎస్సార్ మరణంతో జగన్కన్నా ఎక్కువ నష్టపోయింది, బాధతో కుంగి కృశించిపోయిందీ ప్రజలే. ఆ వాస్తవాన్ని గ్రహించిన జగన్, వారి కన్నీటిని తుడిచి సహాయపడిన తీరును అభినందించడం మాని, అవమానాలపాలు చేయటానికి ప్రయత్నిస్తున్న ఈ రాజకీయ నాయకుల కుటిల రాజనీతికి ఏమని పేరు పెట్టాలో తెలియడం లేదు!
జగన్పైన విమర్శలు చేసేవారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ రాజకీయ జీవితాలు వెలిగించింది జగన్ తండ్రి వైఎస్సార్ కాదా? ఆ మహానేత వారసత్వాన్ని, సమర్థతను అందిపుచ్చుకున్న ఆయన కుమారుడి వ్యక్తిగత, రాజకీయ జీవితాలకు అవినీతి అనే మసిని పూయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? జగనన్న తన దక్షతతో ఆర్థికంగా అభివృద్ధిని సాధించడం తప్పా? అలా సంపాదించిన డబ్బును ప్రజాసేవ కోసం వినియోగించడం నేరమా? రాజకీయ అనిశ్చితి ఏర్పడిన తరుణంలో ప్రజల కష్టాలు తీర్చడం కోసం మరో వైఎస్సార్లా ప్రజల అండతో రాజకీయ పార్టీని స్థాపించడం నేరమా? దుఃఖసాగరంలో మునిగిపోయిన ప్రజలకు అండగా ఉండి, వారిని ఆదుకోవడానికి ఓదార్పుయాత్ర చేపట్టడం పాపమా? ఎందుకు ఆయన్ని అక్రమంగా నిర్బంధించారు? జగన్కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఆయన్ని వేధిస్తున్నవారిని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు.
- కొమ్మూరి చంద్ర, ఆకురాతిపల్లి, కడప జిల్లాజరుగుతున్న అన్యాయాన్ని నిస్సిగ్గుగా చూస్తూ కూర్చున్నారునేడున్న రాజకీయాలలో అవినీతిలేని పార్టీ ఏదీలేదు, అలాగే అవినీతిలేని నాయకుడూలేడు. అందుకేనేమో జగనన్న ఒక తారాజువ్వలా పైకి లేచి, అవినీతిలేని పరిపాలన ఏంటో చూపిస్తా అని సవాలు విసిరితే ఎక్కడ తమ అవినీతి ప్రజల కళ్లకు కనిపిస్తుందోనని ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు నిస్సిగ్గుగా జగనన్న పైకే ఎదురు ఆరోపణలకు దిగారు. ఎందుకంటే అవినీతికి పాల్పడందే వారికి నిద్రపట్టదు. అంతేనా? తాము తిరిగి అధికారంలోకి రావాలంటే జగనన్న అడ్డుతొలగాలి. దీనికోసం ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నాయకులు’ పార్టీ అధిష్టానానికి జగన్పై లెక్కలేని పితూరీలు చెప్పి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చీకటిలో కలపాలని పన్నాగాలు వేసారు.
దీనికితోడు అనేక కుంభకోణాలతో సంబంధమున్న చంద్రబాబు దరిదాపులకు కూడా పోని సి.బి.ఐ అధికారి జేడీ... చంద్రబాబు నిరపరాధి అని సర్టిఫై చేయాలని చూస్తున్నాడు. ఇది నేనొక్కడినే అంటున్న మాట కాదు. నాలాంటి ప్రతి సామాన్యుడు ఇలాగే భావిస్తున్నాడు.
ఇక మన మహిళా మంత్రులు... వై.ఎస్. ఆనాడు తన తోడబుట్టిన వారిగా భావించి ఆడపడుచులకు మంత్రి పదవులిచ్చి వారికి విలువనిస్తే ఇవాళ ఆ మహానుభావుడు లేకపోయేసరికి ఆయన్ని దోషిగా చూపిస్తున్న ప్రభుత్వానికి వారు
(సురేఖమ్మ మినహా) అండగా ఉండడం నీతి అనిపించుకుంటుందా? ఎవరికీ తెలియని అనామకులను మంత్రులను చేస్తే, ఎమ్మెల్యేలను, ఎంపీలను చేస్తే ఇప్పుడు వారు అధికార దాహంతో ఆ మహానేతనే నిందిస్తారా? అయితే త్వరలోనే ఈ వేధింపులన్నిటికీ తెర పడుతుంది. జగనన్న విడుదలౌతాడు. ప్రజలు బ్రహ్మరథం పడతారు.
- బి. వినయ్కుమార్, గణపవరం, ప.గో.జిల్లా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
0 comments:
Post a Comment