ఒకపక్క టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని సంతోషపడుతుంటే, మరో పక్క టిడిపి నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి ప్రముఖుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ తోపాటు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు,ఆయన కుమారుడు వెంకటరమణ కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి చేరుతుండడం ఆ పార్టీకి కొంత షాక్ గానే చెప్పాలి. సాయిరాజ్ తొలిసారి ఎమ్మెల్యే అయితే,కలమట మోహన్ రావు ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.ఆయన కొంతకాలం కాంగ్రెస్ లో కూడా ఉన్నారు.కాగా విశాఖ జిల్లా భీమునిపట్నం టిడిపి ఇన్ ఛార్జీ ఆంజనేయరాజు కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.సాయిరాజ్, మోహన్ రావు, వెంకటరమణలు హైదరాబాద్ వచ్చి జగన్ ను జైలులో కలిసి , ఆ తర్వాత విజయమ్మ సమక్షంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించవచ్చని చెబుతున్నారు.శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్ అవుతారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20130215_6.php
0 comments:
Post a Comment