స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ సీసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గట్టు మాట్లాడుతూ.. ప్రభుత్వం పార్టీల గుర్తుతో ఎన్నికలు జరపాలి అని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి గట్టు విజ్క్షప్తి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011 జూన్లో లేఖ రాసిన విషయాన్ని గట్టు గుర్తు చేశారు. అప్పుడే స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే 4 వేల కోట్ల రూపాయల నిధులు ప్రజలకు ఉపయోగపడేవని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా జరపకుండా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు.
రాజీవ్ ఆశయాలకు భిన్నంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా సర్కార్ వ్యవహరించిందని గట్టు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉందని.. ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీ అన్ని స్థానాలు గెలుస్తుందని ఇన్నాళ్లు వాయిదా వేశారని గట్టు విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011 జూన్లో లేఖ రాసిన విషయాన్ని గట్టు గుర్తు చేశారు. అప్పుడే స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే 4 వేల కోట్ల రూపాయల నిధులు ప్రజలకు ఉపయోగపడేవని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా జరపకుండా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో తెలుపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు.
రాజీవ్ ఆశయాలకు భిన్నంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా సర్కార్ వ్యవహరించిందని గట్టు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉందని.. ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీ అన్ని స్థానాలు గెలుస్తుందని ఇన్నాళ్లు వాయిదా వేశారని గట్టు విమర్శించారు.
0 comments:
Post a Comment