ఇబ్రహీంపట్నం బహిరంగ సభకు పోటెత్తిన జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇబ్రహీంపట్నం బహిరంగ సభకు పోటెత్తిన జనం

ఇబ్రహీంపట్నం బహిరంగ సభకు పోటెత్తిన జనం

Written By news on Thursday, February 7, 2013 | 2/07/2013

రాజన్న బిడ్డకు నీరాజనం పలికిన జిల్లా ప్రజలు
తుర్కయంజాల్ నుంచి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పునఃప్రారంభం
ఉత్సాహంగా అనుసరించిన యువత
మహిళలతో షర్మిల భేటీ... రాజన్న రాజ్యం వస్తుందని భరోసా
ఇబ్రహీంపట్నం బహిరంగ సభకు పోటెత్తిన జనం

 రాజన్న కూతురు షర్మిల పునఃప్రారంభించిన ‘మరో ప్రజా ప్రస్థానం’ యాత్రకు జిల్లాలో అపూర్వ స్పందన లభించింది. మోకాలి గాయంతో నిలిపిన పాదయాత్రను బుధవారం తుర్కయంజాల్ నుంచి ప్రారంభించిన సందర్భంగా షర్మిలకు జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాపై చూపిన ప్రత్యేకాభిమానానికి కృతజ్ఞతగా అక్కున చేర్చుకున్నారు. ప్రతిచోట బాణసంచా పేలుస్తూ... సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. వృద్ధులు, మహిళలు, పెద్ద సంఖ్యలో కాలేజీ విద్యార్థులు షర్మిల వెంట యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తుర్కయంజాల్‌లో మొదలై ఇబ్రహీంపట్నంలో ముగిసిన తొలిరోజు యాత్ర ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, తనను అనుసరిస్తున్న వారిని ఉత్సాహపరుస్తూ షర్మిల పాదయాత్ర కొనసాగించారు. అడుగడుగునా ప్రజలతో ఆమె మమేకమైన తీరు స్థానికులను అబ్బురపరిచింది. తుర్కయంజాల్, శేరిగూడలో మహిళలతో నిర్వహించిన రచ్చబండకు అనూహ్య స్పందన లభించింది. సమస్యలు ఏకరువు పెట్టేందుకు మహిళలు పోటీపడడం.. వారి గోడును ఆలకించిన షర్మిల త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని, మీ బాధలన్నీ తొలగిపోతాయని అనడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

అధికార, ప్రతిపక్షాలపై బాణాలు..
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై షర్మిల సంధించిన విమర్శనాస్త్రాలకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. ఇబ్రహీంపట్నంలో సాయంత్రం జరిగిన సభకు విశేషంగా హాజరైన జనం షర్మిల ప్రసంగానికి ముగ్ధులయ్యారు. చంద్రబాబు నీచ రాజకీయాలు.. అవిశ్వాసం పెట్టకుండా సాగిస్తున్న పాదయాత్రపై విసిరిన చెణుకులకు సభికులు కరతాళ ధ్వనులతో ఆమోదం తెలిపారు. ఇబ్రహీంపట్నం చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జనం పోటె త్తడం... సభలో షర్మిల చేసిన ప్రసంగం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. పాదయాత్ర ఎందుకు చేయాల్సిందో వివరిస్తూ చేసిన ఉపన్యాసానికి విశేష స్పందన లభించింది. ‘సింహం బోనులో ఉన్నా.. బయట ఉన్నా సింహం.. సింహమే.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు’ అంటూ జగనన్నను ఉద్దేశించి చేసిన వాఖ్యాలకు ప్రజలు నుంచి ఈలలు, కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అన్ని వర్గాలను చంద్రబాబు దోచుకున్నారని, సీబీఐ కుట్రలు.. కిరణ్ సర్కారు కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ షర్మిల విసిరిన సవాళ్లు ప్రజలను కట్టిపడేశాయి. 

వైఎస్సార్ సీపీలో నూతనోత్తేజం...
షర్మిల యాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. మోకాలికి గాయం కారణంగా డిసెంబర్ 15న అర్థంతరంగా యాత్ర ఆగిపోవడంతో నిరాశకు గురైన పార్టీ కార్యకర్తల కు ‘మరో ప్రజాప్రస్థానం’ పునఃప్రారంభం కొత్త ఉత్సాహన్ని తెచ్చింది. ఇప్పుడిప్పడే బలీయశక్తిగా ఎదుగుతున్న పార్టీకి షర్మిల యాత్ర మరింత జోరునిచ్చిందని చెప్పవచ్చు. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో కొనసాగుతూ వస్తున్న శ్రేణులన్నీ మరో ప్రజాప్రస్థానంతో వైఎస్సార్ సీపీలో కలిసిపోయాయి. 

ద్వితీయశ్రేణి నేతలు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి... వైఎస్సార్ కాంగ్రెస్ బాట పట్టారు. మరోవైపు షర్మిల యాత్ర సక్సెస్ కావడంతో టీడీపీ, కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఆయా పార్టీలను వీడే ఆలోచనలో పడ్డారు. 
Share this article :

0 comments: