వినబడలేదా కోట్లాది ప్రజల గుండె ఘోష?
కనపడలేదా కోటిన్నర సంతకాల ఆశ భాష?
జనం కేక పొలికేకలా పోరు కేకలా మారకముందే
జగన్ కోసం జనగర్జన దిక్కులు పిక్కటిల్లకముందే
బుద్ధి తెచ్చుకోలేరా! మీ మనసులు శుద్ధి చేసుకోలేరా?
కుట్రలు, కుతంత్రాల భాగోతం ఎన్నాళ్లని?
జగనన్నకు, జననేతకు సంకెళ్లు ఎందుకని?
తెలుగుగడ్డ ఉడికిపోతున్నది, రగిలిపోతున్నది.
తెలుగురాష్ట్రం రణభేరి మోగించింది.
కేసుల డాలులతో, కుట్రలతో, కుతంత్రాలతో
అడ్డుకోండి... చేతనైతే ఆపుకోండి ప్రభంజనాన్ని.
- తుమ్మలపల్లి భాస్కర్, కోదాడ, నల్లగొండ
చట్టాన్ని ఉల్లంఘించి జగన్ని అరెస్ట్ చేశారు!
నిజానికి నేడు జనబాహుళ్యంలో చర్చ జరుగుతోంది జగన్ ‘అవినీతి’ గురించికాదు. రోజూ పుంఖానుపుంఖాలుగా అసత్య కథనాలు ప్రచురిస్తున్న పచ్చ పత్రికలను అడ్డం పెట్టుకొని కుట్రపూరితంగా జగన్గారిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, టి.డి.పి. నాయకుల గురించి! తమ కుతంత్రం ఎల్లకాలం సాగదని ఆ రెండు పార్టీల నాయకులు తెలుసుకోవాలి. చట్టాలని గౌరవించాలని, చట్టం చెప్పిందే వేదంగా భావించాలని అనునిత్యం ప్రజలకి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుండే బడా నేతల అసలు స్వరూపం ఏమిటో జగన్ పై ‘అవినీతి కేసు’ మోపడంతో తేటతెల్లమయింది. జగన్ గారికి అవినీతి బురద అంటించాలనుకున్న నాయకులను నేడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకు నిదర్శనం ఇటీవల నాకు ఎదురైన ఒక అనుభవమే.
ఒకరోజు నేను ఆటోలో వెళ్తుంటే ఆ ఆటోడ్రైవర్కి, ఆటోలో నా పక్కన కూర్చున్న ప్రయాణికుడికి మధ్య జరిగిన సంభాషణను ఇక్కడ యథాతథంగా రాస్తున్నాను.
ఆటో డ్రైవర్: జగన్కి యూత్ ఫాలోయింగ్, మహిళల ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని దొడ్డిదారిన ‘తిరకాసు’ కేసొకటి పెట్టి కాంగ్రెస్, టి.డి.పి. వాళ్లు జగన్ని జైల్లో వేయించారట.
ప్రయాణికుడు: అధికారం ఉన్న వాళ్లు ఎన్నయినా చేస్తారు భయ్యా! అసలు అవినీతి కేసు జగన్ మీద పనిచెయ్యదంట. ఇదంతా పెద్ద పెద్ద సదువులున్న ఆ సి.బి.ఐ వాళ్లకీ, కేసులెట్టిన వాళ్లకి తెలియదా?! అంతా రంగులేసుకొని రాజకీయ నాటకాలు మొదలెట్టారు.
ఆ.డ్రై : వారెంత నాటకాలు మొదలెట్టినా జనం నమ్మటంలేదు గదా? ఇదంతా రాజశేఖర్ రెడ్డి, ఆ జగనన్న సంపాదించిన కీర్తి ప్రతిష్టలు బదనాం చెయ్యటానికేనంట.
ప్రయా: ఏడ్చారు! మరొక వెయ్యి జన్మలెత్తినా రాజశేఖర్రెడ్డిని ప్రజలనుండి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. ఆయన జనంతో అంతగా కల్సిపోయి పనిచేసిండు. అయినా ఈ పెద్దలకింత ‘పిదప’ బుద్ధులెందుకు కల్గుతున్నాయో? ఇదేనేమో కలికాలం అంటే! పెద్దల బుద్దులు చిన్నవిగా మారిపోతే జగనే పెద్ద మనసుతో సి.బి.ఐ ఎంక్వయిరీకి సహకరించాడు. అసలు ఈ పెద్దలకు లాగా జగన్ నాటకం ఆడి ఆ రోజు సి.బి.ఐ ముందు హజరు కాకుండా తప్పించుకుని మరోరోజు కోర్టుకి హాజరయి ఉంటే అసలు జగన్ని అరెస్టు చేసి ఉండే వారు కాదు కదా?
ఆ.డ్రై: ఎంతయినా ఈ కేసు దారుణం! ఇందులో చూపినంత శ్రద్ధ దేశాన్ని దాటివెళ్లిన బ్లాక్మనీని వెనక్కి తెప్పించటంలో చూపి ఉంటే నాలాంటి పేదోళ్ల బతుకులు బాగయి ఉండేవి.
ప్రయా : బాగా చెప్పావు భయ్యా! పేదల బతుకులు బాగు శేయాలన్న ‘రాజన్న’ మనకి దూరమయ్యాడు. పేదల ఆశాజ్యోతి జగన్ని కత్తిగట్టి మరీ జైల్లో పెట్టి ప్రజలకి దూరం చేశారు.
- కె. పద్మావతి, అన్నోజిగూడ, రంగారెడ్డి జిల్లా
కనపడలేదా కోటిన్నర సంతకాల ఆశ భాష?
జనం కేక పొలికేకలా పోరు కేకలా మారకముందే
జగన్ కోసం జనగర్జన దిక్కులు పిక్కటిల్లకముందే
బుద్ధి తెచ్చుకోలేరా! మీ మనసులు శుద్ధి చేసుకోలేరా?
కుట్రలు, కుతంత్రాల భాగోతం ఎన్నాళ్లని?
జగనన్నకు, జననేతకు సంకెళ్లు ఎందుకని?
తెలుగుగడ్డ ఉడికిపోతున్నది, రగిలిపోతున్నది.
తెలుగురాష్ట్రం రణభేరి మోగించింది.
కేసుల డాలులతో, కుట్రలతో, కుతంత్రాలతో
అడ్డుకోండి... చేతనైతే ఆపుకోండి ప్రభంజనాన్ని.
- తుమ్మలపల్లి భాస్కర్, కోదాడ, నల్లగొండ
చట్టాన్ని ఉల్లంఘించి జగన్ని అరెస్ట్ చేశారు!
నిజానికి నేడు జనబాహుళ్యంలో చర్చ జరుగుతోంది జగన్ ‘అవినీతి’ గురించికాదు. రోజూ పుంఖానుపుంఖాలుగా అసత్య కథనాలు ప్రచురిస్తున్న పచ్చ పత్రికలను అడ్డం పెట్టుకొని కుట్రపూరితంగా జగన్గారిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, టి.డి.పి. నాయకుల గురించి! తమ కుతంత్రం ఎల్లకాలం సాగదని ఆ రెండు పార్టీల నాయకులు తెలుసుకోవాలి. చట్టాలని గౌరవించాలని, చట్టం చెప్పిందే వేదంగా భావించాలని అనునిత్యం ప్రజలకి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుండే బడా నేతల అసలు స్వరూపం ఏమిటో జగన్ పై ‘అవినీతి కేసు’ మోపడంతో తేటతెల్లమయింది. జగన్ గారికి అవినీతి బురద అంటించాలనుకున్న నాయకులను నేడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకు నిదర్శనం ఇటీవల నాకు ఎదురైన ఒక అనుభవమే.
ఒకరోజు నేను ఆటోలో వెళ్తుంటే ఆ ఆటోడ్రైవర్కి, ఆటోలో నా పక్కన కూర్చున్న ప్రయాణికుడికి మధ్య జరిగిన సంభాషణను ఇక్కడ యథాతథంగా రాస్తున్నాను.
ఆటో డ్రైవర్: జగన్కి యూత్ ఫాలోయింగ్, మహిళల ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని దొడ్డిదారిన ‘తిరకాసు’ కేసొకటి పెట్టి కాంగ్రెస్, టి.డి.పి. వాళ్లు జగన్ని జైల్లో వేయించారట.
ప్రయాణికుడు: అధికారం ఉన్న వాళ్లు ఎన్నయినా చేస్తారు భయ్యా! అసలు అవినీతి కేసు జగన్ మీద పనిచెయ్యదంట. ఇదంతా పెద్ద పెద్ద సదువులున్న ఆ సి.బి.ఐ వాళ్లకీ, కేసులెట్టిన వాళ్లకి తెలియదా?! అంతా రంగులేసుకొని రాజకీయ నాటకాలు మొదలెట్టారు.
ఆ.డ్రై : వారెంత నాటకాలు మొదలెట్టినా జనం నమ్మటంలేదు గదా? ఇదంతా రాజశేఖర్ రెడ్డి, ఆ జగనన్న సంపాదించిన కీర్తి ప్రతిష్టలు బదనాం చెయ్యటానికేనంట.
ప్రయా: ఏడ్చారు! మరొక వెయ్యి జన్మలెత్తినా రాజశేఖర్రెడ్డిని ప్రజలనుండి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. ఆయన జనంతో అంతగా కల్సిపోయి పనిచేసిండు. అయినా ఈ పెద్దలకింత ‘పిదప’ బుద్ధులెందుకు కల్గుతున్నాయో? ఇదేనేమో కలికాలం అంటే! పెద్దల బుద్దులు చిన్నవిగా మారిపోతే జగనే పెద్ద మనసుతో సి.బి.ఐ ఎంక్వయిరీకి సహకరించాడు. అసలు ఈ పెద్దలకు లాగా జగన్ నాటకం ఆడి ఆ రోజు సి.బి.ఐ ముందు హజరు కాకుండా తప్పించుకుని మరోరోజు కోర్టుకి హాజరయి ఉంటే అసలు జగన్ని అరెస్టు చేసి ఉండే వారు కాదు కదా?
ఆ.డ్రై: ఎంతయినా ఈ కేసు దారుణం! ఇందులో చూపినంత శ్రద్ధ దేశాన్ని దాటివెళ్లిన బ్లాక్మనీని వెనక్కి తెప్పించటంలో చూపి ఉంటే నాలాంటి పేదోళ్ల బతుకులు బాగయి ఉండేవి.
ప్రయా : బాగా చెప్పావు భయ్యా! పేదల బతుకులు బాగు శేయాలన్న ‘రాజన్న’ మనకి దూరమయ్యాడు. పేదల ఆశాజ్యోతి జగన్ని కత్తిగట్టి మరీ జైల్లో పెట్టి ప్రజలకి దూరం చేశారు.
- కె. పద్మావతి, అన్నోజిగూడ, రంగారెడ్డి జిల్లా
0 comments:
Post a Comment