జగన్గారిని జైల్లో పెడితే ఇక వైయస్సార్ కాంగ్రెస్కు మనుగడ ఉండదని మేడమ్గారు తలంచి ఆ పని చేయించారు. కానీ ఆమె తలచినట్లు జరగలేదు. విజయమ్మగారు పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. షర్మిలమ్మగారు పాద యాత్ర కొనసాగిస్తున్నారు. ఇవన్నీ చూసి పాపం మేడమ్ గారి తలపులన్నీ తలకిందులయ్యాయి. కిరణ్కుమార్రెడ్డి బాగా ఇంగ్లిషు మాట్లాడతారని మేడమ్గారు సి.యం.ని చేసారు.
ఆయన గారికి ఇంగ్లిష్ మాట్లాడటం తప్ప... ప్రజల భాష, ప్రజల బాధ తెలియదు. కాంగ్రెస్లోని ఈ అవకతవకలు, అపసవ్యతలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్పార్టీలో అనాదిగా వస్తున్న ఆచారం, ఒక మనిషికి ఒక పదవి. దీనిని పక్కనబెట్టి, బొత్సాగారికి పి.సి.సి. అధ్యక్ష, మంత్రి పదవులను కాంగ్రెస్ కట్టబెట్టింది. అవి చాలుననుకుని ఆయన ప్రజలను విస్మరించారు. ఇక చిరంజీవిగారు... వీరు పార్టీపెట్టి కాంగ్రెస్ పార్టీపై అవాకులు, చెవాకులు పేలి, ఎలక్షన్లలో తన సొంత ఊరు మొగల్తూర్లోనే బోల్తాకొట్టారు. తన పార్టీని కాంగ్రెస్లో కలిపి తనను నమ్ముకుని వచ్చిన వారిని నట్టేట ముంచారు.
ఈయనగారు చేసిన మేలుకు మేడమ్గారు రాజ్యసభ సీటు ఇచ్చి ఒక శాఖను కట్టబెట్టారు. అది చూసుకుని ఆయన తృప్తి పడుతూ ప్రజాసమస్యలతో నాకేమి పని అన్నట్లు మిన్నకుండిపోయారు. ఈ ధోరణి చూస్తుంటే 2014 ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ పార్టీలో బొత్స, చిరంజీవి, కిరణ్కుమార్ తప్ప ఇంకెవరూ మిగలరని స్పష్టమవుతోంది. ప్రజాబలం, దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న యువనేతను కాదన్నందుకు కాంగ్రెస్ పార్టీ త్వరలోనే పెద్ద మూల్యం చెల్లించబోతోంది. ఆ దృశ్యాన్ని మనమంతా ఆనందంగా చూడబోతున్నాం.
- జి.జె ప్రకాశ్, వైజాగ్
0 comments:
Post a Comment