నువ్వొక నిటారు నాయకుడివి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నువ్వొక నిటారు నాయకుడివి

నువ్వొక నిటారు నాయకుడివి

Written By news on Friday, February 1, 2013 | 2/01/2013

వేనవేల చేతులు
నీ నోరు తీపి చేయాలనుకున్న
నీ పుట్టినరోజును
‘లక్ష్యదీక్ష’గా మార్చిన
నీ త్యాగ నిరతిని
జాతి మరువదు!

సోనియానే ‘డోంట్ కేర్’ అన్న
నీ సాహసానికి జాతి యావత్తూ
జేజేలు పలుకుతోంది!
ఓదార్పుయాత్రలో 
పెరుగన్నం తినిపించి
అమృతంలా మజ్జిగ తాపించి
తోటలోని బత్తాయిలు కోసిచ్చి
నీకు పచ్చబొట్టు పెట్టిన
ప్రజల ప్రజా ప్రతిస్పందనలు...
వద్దని సున్నితంగా వారించినా
కన్ను దెబ్బతినేంతగా నీమీద
అభిమాన పూలవర్షం కురిపించి -
నాన్నిచ్చిన వృద్ధాప్యపు పింఛనులోంచి
ఇరవై రూపాయలిచ్చిన
బామ్మ దీవెనలు...
అన్నీ నీకు ముక్కోటి దేవతల శుభాకాంక్షలు!
ఊరు పేరు నిలబెట్టినవాడివి!
నాన్న ప్రతిష్టను జెండాగా ఎగరేసినవాడివి!
నిలువు గీతల చొక్కాలంటే నీకెంత ఇష్టమో...
నువ్వంటే మాకంత ప్రియం!
రాజకీయాల్లో నువ్వో నిటారు నాయకుడివి!
నీ తిరుగుబాటు బావుటా కచ్చితంగా
తెలుగువాడి ఆత్మగౌరవ జెండా!
మేమంతా నీ జెండా కర్రలం!
నీ చేతిలోని ఉద్యమ సంకేత కాగడాలం!

- షేక్ అక్బర్ బాషా, విజయవాడ

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు!

మహానేత వైఎస్సార్ రెక్కల కష్టంతో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన మరణానంతరం ఆయనకు వ్యతిరేకులైన వృద్ధనాయకుల మాటలు విని, రాజనీతి లేని సలహాదారులను నమ్మి, రాష్ట్రంలో తన గోతిని తనే తవ్వుకుంది. అంతేకాదు, వైఎస్సార్ ప్రతిష్టను దెబ్బ తీయటానికి అన్ని సంక్షేమ పథకాలూ తమవేనంటూ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. జగన్‌ను అధికారంలోకి రాకుండా నివారించటానికి కాంగ్రెస్‌వాళ్లు చేయని ప్రయత్నం లేదు. పెట్టని ఇబ్బందులు లేవు. వైఎస్సార్ తెచ్చిన రాజకీయాధికారాన్ని అనుభవిస్తూ ఆయనపైనే నిందలు మోపటం, ఆయన ఎవరినైతే నమ్మారో వారే ఆయనకు అండగా నిలబడలేకపోవటం చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోంది. 

జగన్‌ను ఎదుర్కోటానికి కాంగ్రెస్ తన శత్రువైన తెలుగుదేశంతో చేతులు కలిపింది. చిరంజీవిని కూడా అక్కున చేర్చుకుంది. వై.ఎస్.ఆర్. కుటుంబంపై ఎన్నో అభాండాలు వేసింది. మరెన్నో అవినీతి ఆరోపణలు చేసింది. ఆఖరికి ఒక పార్టీకి అధినేత, పార్లమెంట్ సభ్యుడైన జగన్‌ను విచారణ పేరుతో నెలల తరబడి జైల్లో ఉంచడానికి కూడా వెనకాడలేదు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? జగన్‌కు బెయిల్ రాకుండా మూడునెలలకొక చార్జిషీట్ వేస్తున్న సీబీఐని ఏమనాలి? జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆగమేఘాల మీద వందలమంది సిబ్బందితో ఆయన ఇళ్లు, ఆఫీసులు, బంధువుల నివాసాలపై ఏకకాలంలో దాడులు చేసిన సీబీఐ... అలాంటి కేసులోనే కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుపై విచారణ మొదలుపెట్టాల్సి ఉండగా, ఆ పని చేయకుండా చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చుకునేదాకా ఆగడాన్ని ప్రజలు ఎలా మరిపోతారు? 

నిందితుల్లో కొందరిని అరెస్టు చేసి, మరికొందరిని వదిలివేయటం సీబీఐ ద్వంద్వ నీతి కాదా? దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పెద్దలు జగన్‌పై రాజకీయ కక్ష సాధిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయినా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే ప్రజానాయకుణ్ని ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు. వారు అన్ని విషయాలనూ గమనిస్తున్నారు. తగిన సమయంలో, తగిన విధంగా అరాచక శక్తులకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 

- రాయప్ప తలమాల, విజయవాడ
Share this article :

0 comments: