చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: గట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: గట్టు

చంద్రబాబుకు పిచ్చి ముదిరింది: గట్టు

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

అధికారం లేక చంద్రబాబుకు పిచ్చి ముదిరిపోయిందని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గట్టు మాట్లాడుతూ..చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలపై మండిపడ్డారు. 

బాబు బూతులు ప్రచారం చేయడానికి చెంబు బ్యాచ్ తయారైందని గట్టు అన్నారు. చెంబు బ్యాచ్ అబద్దాలకు ఎల్లోబ్యాచ్ వంతపాడుతోందని గట్టు విమర్శించారు. హెలికాప్టర్ల కుంభకోణానికి, వైఎస్‌కు ముడిపెట్టడం దారుణమని గట్టు అన్నారు. వైఎస్ ప్రయాణించిన బెల్ 430 హెలికాప్టర్ కొన్నది చంద్రబాబేనని గట్టు మీడియాకు తెలిపారు. 

హెలికాప్టర్ కూలిపోయిందంటే అవినీతి జరిగినట్టేనా అని గట్టు ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరపమని రేవంత్‌రెడ్డి కోరతారా గట్టు అన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని గట్టు రామచంద్రరావు తెలిపారు.
Share this article :

0 comments: