కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం డీసీసీబీ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు దిగారు. డీసీసీబీ ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారి చంద్రశేఖర్ అదృశ్యంతో ఎన్నిక నిలిచిపోయింది. డీసీసీబీ ఎన్నిక కోసం ఉదయాన్నే కాంగ్రెస్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు కార్యాలయానికి చేరుకున్నారు.
ఎన్నికల అధికారి రాకపోవటంతో వైఎస్ఆర్సిపి మద్దతుదారులు బుధవారం ఉదయం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు డీసీసీబీ ఎదుట ధర్నాకు దిగారు. ధర్నాలో వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల అధికారి రాకపోవటంతో వైఎస్ఆర్సిపి మద్దతుదారులు బుధవారం ఉదయం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ ఎమ్మెల్యేలు, నేతలు డీసీసీబీ ఎదుట ధర్నాకు దిగారు. ధర్నాలో వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment