సమైక్యాంధ్ర విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడి వైఖరి తనకు నచ్చలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో అభిప్రాయాలు తెలిపేందుకు స్వేచ్ఛ లేదన్నారు. వైఎస్ జగన్తో జరిగిన భేటీలో ఆయనతో తన అభిప్రాయాలు పంచుకున్నట్లు విలేకర్ల అడిగిన ఒక ప్రశ్నకు భాస్కర రామారావు సమాధానంగా తెలిపారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చకే పార్టీ వీడినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మా కార్యకర్తలు మా వెంటే ఉంటారని పేర్కొన్నారు. గురువారం ఉదయం చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్తోభాస్కర రామారావు భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికి చేరాయన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ కీలకపాత్ర పోషిస్తారని ఆయన జోస్యం చేప్పారు. వైఎస్ సంక్షేమ పథకాలు కొనసాగించడం ఒక్క వైఎస్ జగన్కే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ సమయంలో వైఎస్ జగన్కు అండగా ఉండాలిని నిర్ణయం తీసుకున్నట్లు భాస్కర రామారావు తెలిపారు. |
0 comments:
Post a Comment