Home »
» వైఎస్సార్సీపీ బీసీ విభాగం లోగో ఆవిష్కరణ
వైఎస్సార్సీపీ బీసీ విభాగం లోగో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ విభాగం లోగోను పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారమిక్కడ తన నివాసంలో ఆవిష్కరించారు. బీసీ విభాగం వెబ్సైట్ను కూడా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, అధికార ప్రతినిధి బి.జనక్ప్రసాద్, సీఈసీ సభ్యుడు కె.శివకుమార్, ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 123 బీసీ కులాల ఐక్యతను ప్రతిబింబించే విధంగా ఈ ప్రత్యేక లోగోను రూపొందించామన్నారు. బీసీల సంక్షేమం కోసం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని, వైఎస్సార్ కాంగ్రెస్ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుందని చెప్పారు. బీసీలకు ఉపయోగపడే విధంగా రూపొందించిన తమ వెబ్సైట్లో ప్రభుత్వ జీవోలు, ఇతర సమాచారం ఉంటుందని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment