తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు హయాంలోనే రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో ‘విద్యుత్భారాలు- పరిష్కార మార్గాలు’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రపంచబ్యాంకు విధానాలకు అనుకూలంగా ఆయన వ్యవహరించడం వల్ల ప్రజలపై భారం పెరిగిందన్నారు.
సంస్కరణల పేరిట విద్యుత్ భారాన్ని ప్రజలపై రుద్దారని ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపును నిలిపివేసేవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై విద్యుత్ సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రాంతీయ విభేదాలతో రాజకీయపార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని, ప్రజా సమస్యలు ఎవరికీ పట్టటంలేదనీ విరుచుకుపడ్డారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీని దిగ్బంధిస్తామని చెప్పారు.
సంస్కరణల పేరిట విద్యుత్ భారాన్ని ప్రజలపై రుద్దారని ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపును నిలిపివేసేవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై విద్యుత్ సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ప్రాంతీయ విభేదాలతో రాజకీయపార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని, ప్రజా సమస్యలు ఎవరికీ పట్టటంలేదనీ విరుచుకుపడ్డారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీని దిగ్బంధిస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment