టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు

టిడిపిలో అంతర్గత కుమ్ములాటలు

Written By news on Friday, February 15, 2013 | 2/15/2013

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో తాను కలత చెందినట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిసిన అనంతరం చంల్ గూడా జైలు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ గురువు ఎర్రన్నాయుడు అకాల మృతిలో తనకు ఇబ్బందులు ఎదరయ్యాయన్నారు. ఆయన తరువాత జిల్లాలో సమస్యలు పరిష్కరించేవారు లేరన్నారు. విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. ఆ పరిస్థితులలో రాజకీయాల నుంచి తప్పుకుందామని అనుకున్నానని చెప్పారు. అయితే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానని జగన్మోహన రెడ్డి ముందుకు వచ్చారన్నారు. అందువల్ల ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ పరంగా తనకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వెంట నడుస్తానని చెప్పారు.

జగన్ ను కలిసి తమ జిల్లాలో సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో చర్చించానన్నారు. ప్యాకేజీకి అమ్ముడు పోయినట్లు వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. తన గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. తాను అటువంటివాడిని కాదన్నారు. ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాలలోకి వచ్చినట్లు తెలిపారు. రాజకీయాలలో యువతను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సాయిరాజ్ తోపాటు మాజీ ఎమ్మెల్యే కె.మోహనరావు, టిడిపి ఇచ్ఛాపురం ఇన్ ఛార్జి వెంకటరమణలు ..
Share this article :

0 comments: