శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారంనాటి షెడ్యూల్ పూర్తయింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని వేములూరుపాడు సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఆమె చేరుకోవడంతో నేటి పాదయాత్ర షెడ్యూల్ ముగిసింది. బుధవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 13.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కాగా, నేటి పాదయాత్ర ముగిసే సమయానికి శ్రీమతి షర్మిల 89 రోజుల్లో 1228.5 కిలోమీటర్లు నడిచారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి బసచేసిన ప్రాంతం నుంచి బుధవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొండవీడు మీదుగా తాడికొండ నియోజకవర్గంలోని హెచ్.గణేశ్పేట మీదుగా ఫిరంగిపురం చేరుకున్నారు. ఫిరంగిపురంలో ఆమె అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి ఆమె భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. విరామం అనంతరం వేములూరుపాడు మీదుగా రాత్రి బసకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు.
0 comments:
Post a Comment