వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరో ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 26 నుంచి కృష్ణా జిల్లాలో మొదలవుతుందని ఆ పార్టీ నేతలు జలీల్ ఖాన్, ఉదయభాను, గౌతంరెడ్డి, తలశిల రఘురాం చెప్పారు. ఈనెల 26
మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల పాదయాత్ర విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా షర్మిల పాదయాత్ర సాగుతుంది. ఆ తరువాత కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో బహిరంగ
సభ జరుగుతుంది. 26న పశ్చిమ, 27న సెంట్రల్ 28న తూర్పు నియోజకవర్గాలలలో ఆమె పాదయాత్ర చేస్తారు. కృష్ణా జిల్లాలో 272 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారు. మొత్తం 14 నియోజకవర్గాలలో నెల రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది.
పాదయాత్ర 100వ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో షర్మిల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 7 జిల్లాల్లో 43 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగింది. మొత్తం 109 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర జరుగనుంది.
మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల పాదయాత్ర విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటుందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా షర్మిల పాదయాత్ర సాగుతుంది. ఆ తరువాత కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో బహిరంగ
సభ జరుగుతుంది. 26న పశ్చిమ, 27న సెంట్రల్ 28న తూర్పు నియోజకవర్గాలలలో ఆమె పాదయాత్ర చేస్తారు. కృష్ణా జిల్లాలో 272 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేస్తారు. మొత్తం 14 నియోజకవర్గాలలో నెల రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది.
పాదయాత్ర 100వ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో షర్మిల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 7 జిల్లాల్లో 43 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగింది. మొత్తం 109 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర జరుగనుంది.
0 comments:
Post a Comment