వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 26వ తేదీన కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుందని పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. సరిగ్గా ఆదివారం నాటికి వంద రోజులు పూర్తయ్యే షర్మిల యాత్ర ఆ తరువాత మరో రెండు రోజుల పాటు గుంటూరు జిల్లాలో కొనసాగుతుందని, 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుందని ఆయన వివరించారు. కృష్ణా జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 275 కిలోమీటర్ల మేరకు ఆమె నడుస్తారని అన్నారు. ఇప్పటికి షర్మిల ఏడు జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా తన పాదయాత్రను చేశారని ఆయన తెలిపారు. వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటయ్యే బహిరంగ సభకు పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు.
Home »
» ఇప్పటికి ఏడు జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర
ఇప్పటికి ఏడు జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర
Written By news on Saturday, March 23, 2013 | 3/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment