పెంచిన విద్యుత్ చార్జీలు, ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 3న ధర్నాలు నిర్వహించనున్నట్టు కొణతాల రామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్రాం జయంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ చార్జీల పెంపుపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఏప్రిల్ 9న దివంగత నేత వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం ప్రారంభించి 10ఏళ్లు పూర్తైన సందర్బంగా ప్రజా ప్రస్థానానికి పునరంకితమవుతూ రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నాట్టు తెలిపారు. 9న వామపక్ష పార్టీల బంద్తో పాటు వైఎస్ఆర్ సీపీ కూడా బంద్ నిర్వహిస్తుందని కొణతాల చెప్పారు. ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలంతా కలిసిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా పాల్గొంటారని తెలిపారు.
ఏప్రిల్ 9న దివంగత నేత వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం ప్రారంభించి 10ఏళ్లు పూర్తైన సందర్బంగా ప్రజా ప్రస్థానానికి పునరంకితమవుతూ రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నాట్టు తెలిపారు. 9న వామపక్ష పార్టీల బంద్తో పాటు వైఎస్ఆర్ సీపీ కూడా బంద్ నిర్వహిస్తుందని కొణతాల చెప్పారు. ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలంతా కలిసిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా పాల్గొంటారని తెలిపారు.
0 comments:
Post a Comment