కరెంట్ కోతలతో జనజీవనం స్తంభించిందని వైఎస్ఆర్ సీసీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. కరెంట్ కోతలతో పంటలు ఎండాయని, కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కరెంట్ సమస్యపై సరైన పోరాటం చేయట్లేదన్నారు.
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్... చంద్రబాబు బినామీ అని ఆరోపించారు. ప్రభాకర్ బీజేపీకి అధికార ప్రతినిధా లేక టీడీపీకా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ప్రజాసమస్యల కంటే వైఎస్ కుటుంబాన్ని విమర్శించడమే ముఖ్యమా అని నిలదీశారు. బ్రదర్ అనిల్పై తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు.
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్... చంద్రబాబు బినామీ అని ఆరోపించారు. ప్రభాకర్ బీజేపీకి అధికార ప్రతినిధా లేక టీడీపీకా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ప్రజాసమస్యల కంటే వైఎస్ కుటుంబాన్ని విమర్శించడమే ముఖ్యమా అని నిలదీశారు. బ్రదర్ అనిల్పై తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు.
0 comments:
Post a Comment