Home »
» వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్సీ బొడ్డు
వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్సీ బొడ్డు
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు శుక్రవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామారావుతో పాటు ఆయన కుమారుడు వెంకటరమణ, మండపేట నియోజకవర్గ నేత పాలచర్ల శ్రీనివాస్లతో పాటు జిల్లాకు చెందిన నాయకులు పెద్దసంఖ్యలో హైదరాబాద్ తరలివచ్చి పార్టీలో చేరారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట వైఎస్సార్ సీపీ నేతలు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, కె.చిట్టబ్బాయి, ఆదిరెడ్డి అప్పారావు తదితరులున్నారు. అనంతరం బొడ్డు భాస్కర రామారావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. సీబీఐని ఉపయోగించుకొని కుట్రపూరిత ఆరోపణలతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని అన్యాయంగా జైలుపాలు చేశారన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు, ఈ సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉండాలని భావించి వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఇక నుంచి పార్టీ పటిష్టత కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment