రైతులకు, బిసిలకు, మైనార్టీలకు అందరికీ న్యాయం చేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు బాగుండాలని ఆలోచించిన వ్యక్తి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏ వర్గానికి న్యాయంచేయలేదన్నారు. బాబు మాటలను ప్రజలు ఎవరూ నమ్మేపరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు దారుణంగా ఉన్నాయన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధిస్తే విద్యార్థులు ఎలా చదువుకోగలుగుతారని ఆయన ప్రశ్నించారు.
|
Home »
» జగన్ అందరికీ న్యాయం చేస్తారు:శ్రీకాంత్
జగన్ అందరికీ న్యాయం చేస్తారు:శ్రీకాంత్
Written By news on Friday, March 1, 2013 | 3/01/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment