తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ మేనమామని మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో బుధవారం ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సహజంగా తల్లి చనిపోతూ తన బిడ్డలను మేనమామ చేతుల్లో పెట్టి వారి ఆలనా పాలనా చూసుకోవాలంటూ అప్పగింతలు పెడుతుందని అన్నారు. అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల బాగోగులను చంద్రబాబుకు అప్పగించారని అన్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతున్నారు. చంద్రబాబు ఉన్నంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని పేర్కొన్నారు.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/mar/13/latest/13new65&more=dailyupdates/ajlatestnews#.UUDVjFm6b6Q
0 comments:
Post a Comment